ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: నిజామాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తల బలవన్మరణం

ABN, First Publish Date - 2022-08-21T19:50:06+05:30

సాఫిగా సాగిపోయే కొన్ని జీవితాలు విషాదంగా ముగుస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: సాఫిగా సాగిపోయే కొన్ని జీవితాలు విషాదంగా ముగుస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయి. మూకుమ్మడిగా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం ఇటీవల కాలంలో కలవరపెడుతున్నాయి. నిజామాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ పట్టణంలోని కపిల హోటల్‌ రూమ్‌ నెం.101లో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సూర్యప్రకాష్, అక్షయ, చిన్నారులు ప్రత్యూష, అద్వైత్‌గా గుర్తించారు. 15 రోజులుగా సూర్యప్రకాష్ కుటుంబం హోటల్‌లోనే ఉంటోంది. సూర్యప్రకాష్ రియల్‌ఎస్టేట్ వ్యాపారo చేస్తున్నట్లు చెబుతున్నారు. తొలుత భార్య, పిల్లలకు పురుగుల మందు తాగించి.. ఆ తర్వాత సూర్యప్రకాష్ ఉరివేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2022-08-21T19:50:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising