TS News: నిజామాబాద్లో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తల బలవన్మరణం
ABN, First Publish Date - 2022-08-21T19:50:06+05:30
సాఫిగా సాగిపోయే కొన్ని జీవితాలు విషాదంగా ముగుస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలకు
నిజామాబాద్: సాఫిగా సాగిపోయే కొన్ని జీవితాలు విషాదంగా ముగుస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయి. మూకుమ్మడిగా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం ఇటీవల కాలంలో కలవరపెడుతున్నాయి. నిజామాబాద్లో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ పట్టణంలోని కపిల హోటల్ రూమ్ నెం.101లో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సూర్యప్రకాష్, అక్షయ, చిన్నారులు ప్రత్యూష, అద్వైత్గా గుర్తించారు. 15 రోజులుగా సూర్యప్రకాష్ కుటుంబం హోటల్లోనే ఉంటోంది. సూర్యప్రకాష్ రియల్ఎస్టేట్ వ్యాపారo చేస్తున్నట్లు చెబుతున్నారు. తొలుత భార్య, పిల్లలకు పురుగుల మందు తాగించి.. ఆ తర్వాత సూర్యప్రకాష్ ఉరివేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.
Updated Date - 2022-08-21T19:50:06+05:30 IST