ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15వ ఆర్థికసంఘం సలహాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ

ABN, First Publish Date - 2022-01-23T08:51:12+05:30

మిలియన్‌ ప్లస్‌ సిటీస్‌కు కేంద్ర పరిధిలోని 15వ ఆర్థికసంఘం ఇచ్చే సలహాలు, సూచనల అమలుకు, ఆ కార్యక్రమ నిర్వహణ, పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : మిలియన్‌ ప్లస్‌ సిటీస్‌కు కేంద్ర పరిధిలోని 15వ ఆర్థికసంఘం ఇచ్చే సలహాలు, సూచనల అమలుకు, ఆ  కార్యక్రమ నిర్వహణ, పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం సూచనల మేరకు ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా పర్యావరణ శాఖ ఎస్‌సీఎస్‌, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైౖర్మన్‌, రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి, రాష్ట్ర చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రీ ప్రతినిధి, సీడీఎంఏ ఉంటారు.

Updated Date - 2022-01-23T08:51:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising