హైదరాబాద్లో నేడు శ్రీరామనవమి శోభాయాత్ర
ABN, First Publish Date - 2022-04-10T14:34:14+05:30
నగరంలో నేడు శ్రీరామనవమి శోభాయాత్ర జరగనుంది.
హైదరాబాద్: నగరంలో నేడు శ్రీరామనవమి శోభాయాత్ర జరగనుంది. శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు భజరంగదల్, బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ శోభాయాత్ర మధ్యాహ్నం12:30 గంటలకు మంగళ్హాట్ నుంచి బయలుదేరుతుంది. కొవిడ్ కారణంగా శోభాయాత్ర రెండేళ్లుగా వాయిదా పడింది. ఈ ఏడాది భారీస్థాయిలో శోభాయాత్రకు ఏర్పాట్లు చేశారు. లక్ష మందికిపైగా శోభాయాత్రలో పాల్గొంటారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. రాత్రి 10గంటల వరకు పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. శ్రీరామనవమి సందర్భంగా మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది.
Updated Date - 2022-04-10T14:34:14+05:30 IST