భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
ABN, First Publish Date - 2022-04-10T14:51:31+05:30
భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు.
భద్రాచలం: భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు మూలమూర్తులకు ఏకాంతంగా తిరుకల్యాణం జరపనున్నారు.అనంతరం మిథిలా స్టేడియానికి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తారు. మిథిలా స్టేడియంలో ముందుగా పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన గావిస్తారు. యోత్ర ధారణ, కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు జరుపుతారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు వైభవంగా శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో 1,400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Updated Date - 2022-04-10T14:51:31+05:30 IST