ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడారం పనులపై స్పెషల్‌ కమిటీ వేయాలి: సీతక్క

ABN, First Publish Date - 2022-02-13T00:37:34+05:30

మేడారం జాతర కోసం రూ.41 కోట్లతో చేపట్టిన సివిల్‌ పనులపై స్పెషల్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: మేడారం జాతర కోసం రూ.41 కోట్లతో చేపట్టిన సివిల్‌ పనులపై స్పెషల్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కమిటీ నివేదిక ఆధారంగానే బిల్లులు మంజూరు చేయాలని అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మేడారంలో జరుగుతున్న పనులపై స్థానిక శాసన సభ్యురాలినైన తన అభిప్రాయం, ప్రమేయం లేకుండానే ఇష్టానుసారంగా చేపడుతున్నారని విమర్శించారు. కోట్లాది రూపాయల బడ్జెట్‌ బాగానే ఉన్నా పనుల కేటాయింపు, నాణ్యత అనుమానాలకు తావిస్తోందని, దీనిపై ప్రభుత్వం పునఃసమీక్షించుకొని సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. గట్టమ్మ దేవాలయం వద్ద సుమారు రూ.60 లక్షల పైగా పనులు పూర్తిగా నామినేటెడ్‌ పద్ధతిలో కొందరి చేతనే జరిపించడం వెనుక ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలోనే మేడారం పనులు జరుగుతున్న దృష్ట్యా ఆయనే పూర్తి బాధ్యత వహించాలని సీతక్క డిమాండ్‌ చేశారు.


Updated Date - 2022-02-13T00:37:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising