తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం
ABN, First Publish Date - 2022-01-29T21:39:03+05:30
రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1 నుంచి పునః
హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు.
మంగళవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెలాఖరుతో తెలంగాణలో విద్యాసంస్థలకు ఇచ్చిన సెలవులు ముగియనున్నాయి. విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
Updated Date - 2022-01-29T21:39:03+05:30 IST