అనాధ పిల్లల ధృవీకరణ కోసం త్వరలోనే చట్టం: మంత్రి సత్యవతి
ABN, First Publish Date - 2022-01-19T23:00:03+05:30
అనాధ పిల్లల ధృవీకరణ కోసం త్వరలోనే చట్టం: మంత్రి సత్యవతి
హైదరాబాద్: మేడారం వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. భక్తులకు ఈసారి స్లాట్ బుకింగ్ అవకాశం కల్పిస్తామన్నారు. వీఐపీల పాస్లపై దర్శనం టైం ఇస్తామని తెలిపారు. మేడారం దగ్గర 200 ఎకరాలు కొనాలని సీఎం అన్నారని చెప్పారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. ఫిబ్రవరి 18న సీఎం వనదేవతలను దర్శించుకుంటారని పేర్కొన్నారు. మేడారానికి 8 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. అనాధ పిల్లల ధృవీకరణ కోసం త్వరలోనే చట్టం తెస్తామన్నారు.
Updated Date - 2022-01-19T23:00:03+05:30 IST