ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడోళ్లతో పెట్టుకుంటే గద్దె దింపేస్తారు

ABN, First Publish Date - 2022-05-16T08:47:06+05:30

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచి ఆడోళ్లతో పెట్టుకుందని, ఆ ప్రభుత్వాన్ని ఆడోళ్లే గద్దె దింపుతారని మంత్రి సబితారెడ్డి హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీకి మంత్రి సబిత హెచ్చరిక

సరూర్‌నగర్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచి ఆడోళ్లతో పెట్టుకుందని, ఆ ప్రభుత్వాన్ని ఆడోళ్లే గద్దె దింపుతారని మంత్రి సబితారెడ్డి హెచ్చరించారు. ఓ వైపు వంట నూనెల ధరలు, ఇంకో వైపు పెట్రో ధరలు, అవి చాలదన్నట్టు గ్యాస్‌ ధరలను సైతం కేంద్రం నెలకోసారి పెంచుతున్నదని మండిపడ్డారు. గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ ఆదివారం మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని బాలాపూర్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన భారీ ర్యాలీలో సబితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రానికి కనబడడం లేదా అని నిలదీశారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందని బీజేపీ నేతలు అధికారం కావాలని అడుగుతున్నారని ప్రశ్నించారు. తుక్కుగూడ సభలో ‘ప్లీజ్‌.. మాకు ఒక్కసారి అవకాశమివ్వండి’ అంటూ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సబితారెడ్డి సెటైర్లు వేశారు. ‘ఒకాయనకు అధికారం కావాలంట.. ప్లీజ్‌ ప్లీజ్‌ అని బతిమిలాడుతున్నాడు. మేం కూడా బతిమిలాడుతున్నాం. ప్లీజ్‌ మోదీ గారు.. గ్యాస్‌ ధర తగ్గించండి’ అంటూ ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-05-16T08:47:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising