కాళేశ్వరం ఆలయంలో సజ్జనార్ ప్రత్యేక పూజలు
ABN, First Publish Date - 2022-10-04T06:26:06+05:30
కాళేశ్వరం ఆలయంలో సజ్జనార్ ప్రత్యేక పూజలు
మహదేవపూర్, అక్టోబరు 3: భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ఆలయాన్ని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సోమవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు స్వామి శేష వస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏఎస్పీ గిరిప్రసాద్, కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, మహదేవపూర్ సీఐ కిరణ్కుమార్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
అదుపు తప్పిన డీఎం కారు.. గాయాలు
భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజన్బాబుకు ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు చెట్టుకు ఢీకొంది. దీంతో ఆయనతోపాటు డ్రైవరు సురేష్కు, ఆ సంస్థ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సదయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. మహదేవూర్లోని కాళేశ్వరాలయాన్ని దర్శించుకోవడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రాగా ఆయన్ను కలిసేందుకు డీఎం, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భూపాలపల్లి నుంచి
Updated Date - 2022-10-04T06:26:06+05:30 IST