మహేందర్ రెడ్డి నాపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారు: రోహిత్ రెడ్డి
ABN, First Publish Date - 2022-04-28T19:28:13+05:30
ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు
హైదరాబాద్ : ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన ఎబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తానెంటో తన నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. గతంలో చాలాసార్లు ఇలాంటి వివాదాలు వచ్చాయన్నారు. విషయం సీఎం దృష్టికి, కేటీఆర్ దృష్టికి వెళ్ళిందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాండూరు టికెట్ తనదేనని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులను బూతులు తిట్టిన కేసులో తప్పు ఎవరిదో త్వరలో తేలుతుందన్నారు. తాను రౌడీ షీటర్లను పెంచి పోషిస్తున్నానడం అవాస్తవమన్నారు. దమ్ముంటే మహేందర్ రెడ్డి నిరూపించాలన్నారు. ఇసుక అక్రమ రవాణా చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఎవరు చేస్తున్నారో స్థానిక ప్రజలకు తెలుసన్నారు. మహేందర్ రెడ్డి వ్యవహారం సీఎం దృష్టికి, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రోహిత్ రెడ్డి తెలిపారు.
Updated Date - 2022-04-28T19:28:13+05:30 IST