HYD: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
ABN, First Publish Date - 2022-05-24T17:44:58+05:30
నగరంలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది.
హైదరాబాద్: నగరంలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. కుష్బుసింగ్ (31) అనే మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-05-24T17:44:58+05:30 IST