ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైపాల్ రెడ్డి లేకున్నా.. ఆయన సాధించిన తెలంగాణలో ఉన్నాం: రేవంత్

ABN, First Publish Date - 2022-01-16T17:49:39+05:30

నెక్లెస్ రోడ్‌లోని జైపాల్ రెడ్డి ఘాట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి దంపతులు నివాళులు అర్పించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నెక్లెస్ రోడ్‌లోని జైపాల్ రెడ్డి ఘాట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి దంపతులు నివాళులు అర్పించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి లేకపోయినా ఆయన సాధించిన తెలంగాణలో మనము ఉన్నామన్నారు. రాజకీయ విలువలు కాపాడిన వ్యక్తుల్లో జైపాల్ రెడ్డి ఒకరన్నారు. దేశానికి వన్నె తెచ్చే నిర్ణయాలు జై పాల్ రెడ్డి తీసుకున్నారని రేవంత్ తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌లో జై పాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరగడం లేదని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆయన ఆశయాలు నెరవేరతాయన్నారు. రాజకీయాలు అంటే పార్టీ ఫిరాయింపులు, కొనుగోళ్ళు, కాంట్రాక్ట్‌లుగా కేసీఆర్ చేశారన్నారు. జైపాల్ రెడ్డి స్ఫూర్తిని తాము కొనసాగిస్తామని.. పీవీ, మర్రి చెన్నా రెడ్డి సరసన నిలిచే నాయకుడు జైపాల్ రెడ్డి అని రేవంత్ పేర్కొన్నారు.

Updated Date - 2022-01-16T17:49:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising