కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రం విచారణ జరిపించాలి: రేవంత్రెడ్డి
ABN, First Publish Date - 2022-07-18T03:36:15+05:30
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పడి.. జాతీయ విపత్తును వదిలేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పడి.. జాతీయ విపత్తును వదిలేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వరదల్లో మునిగిపోతున్న ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ గడప దాటారని అన్నారు. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణలో లోపం జరిగిందని ఆయన ఆరోపించారు. క్లౌడ్ బరెస్ట్ పేరుతో తన అవినీతిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. విదేశీ కుట్రపై సమాచారం ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రం విచారణ జరిపించాలన్నారు.
Updated Date - 2022-07-18T03:36:15+05:30 IST