కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపుతాం
ABN, First Publish Date - 2022-08-14T05:49:24+05:30
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపుతాం
షాబాద్/నందిగామ, ఆగస్టు 13: దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్న బీజేపీ, టీఆర్ఎ్సలను గద్దె దింపుతామని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్రెడ్డి అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం షాబాద్ మండలంలో పాదయాత్ర నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గంలో 75 కిలోమీటర్ల ఆజాద్కి గౌరవ్ పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు సున్నపు వసంతం, పార్టీ చేవెళ్ల, షాబాద్ మండలాల అధ్యక్షులు వీరేందర్రెడ్డి, చంద్రశేఖర్, టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివా్సగౌడ్, నాయకులు ఆంజనేయులు, స్వామి, మహేందర్రెడ్డి, చంద్రారెడ్డి, గౌతమ్ ఉన్నారు. అదేవిధంగా నందిగామ మండలపరిధిలోని ఆయా గ్రామాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో పాదయాత్ర చేశారు. కార్యక్రమంలో నాయకులు జంగ నర్సింలు, జిల్లెల్ల రాంరెడ్డి, పాండురంగారెడ్డి, కొమ్ముకృష్ణ, కుమార్గౌడ్, చంద్రపాల్రెడ్డి, కావలి కృష్ణ, విఘ్నేశ్వర్రెడ్డి, జ్ఞానేశ్వర్, మంకాల శ్రీశైలం, సతీష్, బుచ్చయ్య, శివ, రాజశేఖర్, సాములయ్య, శ్రీను, శ్రావణ్ పాల్గొన్నారు.
Updated Date - 2022-08-14T05:49:24+05:30 IST