కనులపండువగా వేంకటేశ్వరుడి గరుడ సేవ
ABN, First Publish Date - 2022-05-18T05:58:00+05:30
కనులపండువగా వేంకటేశ్వరుడి గరుడ సేవ
ఘట్కేసర్ రూరల్, మే 17 : మండల పరిధి వెంకటాపూర్లో గల శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి గరుడసేవ కనలపండువగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవ, నిత్యహోమం, నివేధన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం గరుడ సేవ కార్యక్రమంలో భాగంగా స్వామివారిని షావ గ్రామంలో తీశారు. భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు, పూలు పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉదారి వేణుగోపాల్, ఆలయ ఈవో ఎల్. భాగ్యలక్ష్మి, సర్పంచ్ నీరుడి గీతాశ్రీనివాస్, ఉపసర్పంచ్ సత్యనారాయణ, కమిటీ డైరెక్టర్లు, పాల్గొన్నారు.
Updated Date - 2022-05-18T05:58:00+05:30 IST