ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్‌ బోల్తా.. బాలిక దుర్మరణం

ABN, First Publish Date - 2022-07-04T05:45:28+05:30

ట్రాక్టర్‌ బోల్తా.. బాలిక దుర్మరణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగామ, జూలై 3: పొలం దున్నడానికి వచ్చిన ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడటంతో బాలిక మృతిచెందింది. ఈ ఘటన నందిగామ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని చేగూర్‌ శివారులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేగూర్‌ గ్రామానికి చెందిన బల్ల మాధవి వారికున్న పొలం దున్నడానికి గ్రామానికి చెందిన సత్తయ్య ట్రాక్టర్‌ను రప్పించింది. పొలంలో పనులు జరుగుతుండగా మాధవి కూతురు బల్ల శృతి(15) సరదాకి ట్రాక్టర్‌పై కూర్చుంది. ఈ క్రమంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడడంతో బాలిక అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఘటనాస్థలంలో తల్లి రోదనలు మిన్నంటాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు డ్రైవర్‌ సత్యయ్యపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామయ్య తెలిపారు. 

Updated Date - 2022-07-04T05:45:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising