గులాబీ గూటికి ముగ్గురు సర్పంచులు
ABN, First Publish Date - 2022-07-01T06:34:40+05:30
గులాబీ గూటికి ముగ్గురు సర్పంచులు
- మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎ్సలో చేరిక
ఆమనగల్లు, జూన్ 30: తలకొండపల్లి మండలానికి చెందిన మగ్గురు సర్పంచులు గురువారం సాయంత్రం గులాబీ గూటికి చేరారు. హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ఎమ్మెల్సీ కసిరెడ్డినారాయణరెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో మెదక్పల్లి సర్పంచ్ ధరణి శివశంకర్రెడ్డి, జంగారెడ్డిపల్లి సర్పంచ్ వరలక్ష్మిరాజేందర్రెడ్డి, రాంపూర్ సర్పంచ్ శ్యామ్సుందర్రెడ్డిలు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గులాబి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ శ్రీనివా్సరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, భూపతిరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-07-01T06:34:40+05:30 IST