ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాన్ని శక్తివంతం చేయడంలో కాంగ్రెస్‌ పాత్ర అమోఘం

ABN, First Publish Date - 2022-08-11T05:30:00+05:30

దేశాన్ని శక్తివంతం చేయడంలో కాంగ్రెస్‌ పాత్ర అమోఘం

బొంరాస్‌పేట్‌: తుంకిమెట్ల మీదుగా పాదయాత్ర చేస్తున్న పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • డీసీసీ అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌

పరిగి/బొంరాస్‌పేట్‌/పూడూర్‌, ఆగస్టు 11 : స్వాతంత్య్రం సిద్ధించాక ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా తయారు చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ పాత్ర అమోఘమైందని డీసీసీ అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్రలో భాగంగా గురువారం పరిగి మండలం గడిసింగాపూర్‌ నుంచి పరిగి పట్టణం మీదుగా నస్కల్‌ వరకు పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా జనరల్‌ సెక్రటరీ హన్మంతుముదిరాజ్‌, పరిగి మండలాధ్యక్షుడు పరుషరాంరెడ్డి, పట్టణాధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.  అదేవిధంగా బొంరాస్‌పేట్‌ మండలం తుంకిమెట్ల మీదుగా నస్కల్‌ వరకు పాదయాత్ర చేపట్టారు. పూడూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పరిగి మండలం గడిసింగాపూర్‌లో పాదయాత్రలో పాల్గొన్నారు. అదేవిధంగా బొంరాస్‌పేట్‌, పూడూర్‌ మండలాల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, పూడూర్‌ మండల కార్యదర్శి శ్రీనివాస్‌, మండలాధ్యక్షుడు సురేందర్‌, అజీమ్‌ పటేల్‌ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising