పథకాల లక్ష్యాలను చేరుకోవాలి
ABN, First Publish Date - 2022-07-03T05:59:44+05:30
పథకాల లక్ష్యాలను చేరుకోవాలి
తలకొండపల్లి, జూలై 2: హరితహారం లక్ష్యాల పూర్తికి గ్రామస్థాయి ప్రజాప్రతినిఽధులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎంపీడీవో రాఘవులు కోరారు. మండలంలోని చంద్రధన, లింగరావుపల్లి గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో నర్సరీలు, పారిశుధ్య కార్యక్రమాలు, పాఠశాలలను ఆయన పరిశీలించారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు నాటేందుకు స్థలాలను వెంటనే ఎంపిక చేయాలని సూచించారు. మన ఊరు-మనబడి కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలల్లో త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బక్కికుమార్, ఎల్లమ్మ, ఏఈ రవితేజ, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
Updated Date - 2022-07-03T05:59:44+05:30 IST