ఇంటింటికీ తాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యం
ABN, First Publish Date - 2022-05-25T05:23:37+05:30
ఇంటింటికీ తాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యం
ఘట్కేసర్ రూరల్, మే 24 : ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ సుదర్శన్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కాచవానిసింగారంలో మంగళవారం కృష్ణ నీటి పైపులైను పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటింటికీ శుభ్రమైన తాగునీరు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. తెలంగాణలో ఆడబిడ్డలు నీటి కోసం బిందెలు పట్టుకొని బయటకు రావొద్దనే.. ఇంటింటికీ గోదావరి, కృష్ణ నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జలమండలి ఆధ్వర్యంలో పైపులైను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. వైఎస్ ఎంపీపీ కర్రె జంగమ్మ, సర్పంచ్ కొంతం వెంకట్రెడ్డి, ఉపసర్పంచ్ చెట్టిపల్లి గీతాముత్యం, వార్డుసభ్యులు కిన్నెర లక్ష్యిశ్రీ, మట్ట విష్ణుగౌడ్, రజిత, గీత, నాయకులు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగులపల్లి రమేష్, కిన్నెర జంగయ్య, బసవ రాజుగౌడ్, రమణారెడ్డి, జైపాల్రెడ్డి, నల్ల శ్రీధర్రెడ్డి, మోహన్రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-25T05:23:37+05:30 IST