ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ కార్యకర్తలపై దాడి హేయం

ABN, First Publish Date - 2022-08-18T05:16:25+05:30

బీజేపీ కార్యకర్తలపై దాడి హేయం

విలేకరులతో మాట్లాడుతున్న రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌

తాండూరు, ఆగస్టు 17 : వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో సీఎం పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలపై పోలీసులతో దాడి చేయించడం హేయమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్‌ అన్నారు. బుధవారం తాండూరులో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు, కౌన్సిలర్‌ సాహు శ్రీలత, బీజేపీ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ ఎన్ని దాడులకు యత్నించినా.. బీజేపీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఈ ప్రాంతంపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని, మెడికల్‌ కళాశాల, తట్టేపల్లిని మండలముగా ప్రకటించలేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని వారు పేర్కొన్నారు. బీజేపీ అంటేనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నులో వణుకు పుడుతుందని, ఏ సభకు వెళ్లినా బీజేపీని విమర్శించకుండా సీఎం నిద్రపోవడం లేదన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు పూజారి పాండు, సందీప్‌, విక్రంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-18T05:16:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising