నేడు తాండూరులో విత్తన మేళా
ABN, First Publish Date - 2022-05-24T05:38:38+05:30
నేడు తాండూరులో విత్తన మేళా
తాండూరు, మే 23: తాండూరులోని వ్యవసాయ పరిశోధన కేం ద్రంలో మంగళవారం విత్తన మేళా నిర్వహిస్తామని పరిశోధన కేం ద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి.సుధారాణి సోమవారం తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో ఏటా మే 24న రాజేంద్రనగర్ కేంద్రంగా పెద్ద ఎత్తున విత్తన మేళాను నిర్వహిస్తోందన్నారు. మేళాలో తాండూరు పరిశోధనస్థానంలో రూపొందించిన కంది రకాలు టీడీఆర్జీ-4, టీడీఆర్జీ-59, ఆశ రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. దీంతోపాటు రైతులకు నూతన వంగడాల లక్షణాలు తదితరాలపై అవగాహన కలిగించడానికి శాస్త్రవేత్తలతో చర్చావేదికను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
Updated Date - 2022-05-24T05:38:38+05:30 IST