విలువలు పాటిస్తేనే వ్యక్తులకు గౌరవం
ABN, First Publish Date - 2022-05-24T05:39:12+05:30
విలువలు పాటిస్తేనే వ్యక్తులకు గౌరవం
వికారాబాద్, మే 23: మానవ విలువలు పాటిస్తేనే సమాజంలో వ్యక్తులకు గౌరవం వస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. జిల్లాలో మూడేళ్లు వివిధ శాఖల్లో అదనపు కలెక్టర్గా పనిచేసి నాగర్కర్నూల్కు బదిలీ అయిన ఆయనను సోమవారం అధికారులు, సిబ్బంది వీడ్కోలు సభ నిర్వహించి అభినందన నిర్వహించారు. శాలువాలు, ఫ్లవర్ బొకేలతో సత్కకరించారు. మోతీలా ల్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో తనకు అన్ని విధాలా సహకరించిన యంత్రాగానికి, సిబ్బందికి రుణపడి ఉంటానన్నారు. ప్రతి పేపర్లో పేదవాడి ముఖాన్ని చూసి పనిచేయాలని, ఆ దిశగా తనవంతు సేవ చేశానన్నారు. జిల్లా ఎస్టీ వెల్ఫేర్ అధికారి కోటాజి అధ్యక్షత వహించారు. డీఆర్డీవో కృష్ణన్, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, సీపీవో నిరంజన్రావు, వెల్ఫేర్ ఆఫీసర్ లలితకుమారి, డీఈవో రేణుకాదేవి, డీఏవో గోపాల్, డీవైఎ్సవో హనుమంతరావు, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజస్, ట్రెజరీ ఆఫీసర్ దశరథ్, ఏవో హరిత, ఇతర శాఖల అధికారులు వేణుమాధవ్, రాజేశ్వర్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-24T05:39:12+05:30 IST