రోడ్డుపై నిలిచిన వాననీరు
ABN, First Publish Date - 2022-06-30T05:14:22+05:30
రోడ్డుపై నిలిచిన వాననీరు
- లోపించిన పారిశుధ్యం
- ఇబ్బందులు పడుతున్న జనం
ఆమనగల్లు, జూన్ 29: ఆమనగల్లులోని గాంధీ చౌక్వద్ద పారిశుధ్యం పూర్తిగా లోపించింది. వర్షపు నీరు నిలిచి బురద గుంటగా మారింది. దుర్గంధం వస్తోంది. దోమలు, ఈగలు వృద్ధి చెందుతున్నాయి. బురదలో పందులు పొర్లుతున్నాయి. రోడ్డు మధ్యలో నీటినిల్వతో రాకపోకలకు వాహదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 20 రోజుల నుంచీ రోడ్డుపై నీరు నిలుస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదు. వాననీరు పోయేందుకు వ్యవస్థ లేకపోవడంతో నీరు నిలుస్తోంది. ఈ స్థలంలో సీసీ వేసి ఎత్తు పెంచితే నీరు నిల్వ ఉండ దు. ఇప్పటికైనా అధికారులు సమస్య పరిష్కారానికి చర్య లు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
Updated Date - 2022-06-30T05:14:22+05:30 IST