పాపన్నగౌడ్ ఆశయాలను సాధించాలి
ABN, First Publish Date - 2022-08-19T05:41:54+05:30
పాపన్నగౌడ్ ఆశయాలను సాధించాలి
షాద్నగర్అర్బన్/కొత్తూర్/కొందుర్గు/ చేవెళ్ల/షాబాద్/మంచాల/ కందుకూరు/శంషాబాద్/యాచారం/ఆమనగల్లు/కడ్తాల్/తలకొండపల్లి, ఆగస్టు 18: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను సాధించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి సందర్భంగా ఫరూఖ్నగర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట గురువారం మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్తో కలిసి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు రంగయ్యగౌడ్, అశోక్గౌడ్, శ్రీనివా్సగౌడ్, శివశంకర్గౌడ్, బాల్రాజ్గౌడ్ పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తూర్లో గౌడ సంఘం అధ్యక్షుడు కూన సుదర్శన్గౌడ్ నివాళులర్పించారు. ఎంపీటీసీ రాజేందర్గౌడ్, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ నర్సింహాగౌడ్, పాల్గొన్నారు. అదేవిధంగా కొందుర్గులోని బస్టాండ్ ఆవరణలో పాపన్నగౌడ్కు గౌడ సంఘం మండల నాయకులు జయంతి వేడుకలు జరిపారు. కె.రాములుగౌడ్, అమృతయ్యగౌడ్, జగదీశ్వర్గౌడ్, అనిల్గౌడ్, రామకృష్ణగౌడ్, ప్రవీణ్గౌడ్ పాల్గొన్నారు. అదేవిధంగా చేవెళ్ల మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఎం.కృష్ణారెడ్డి, పెంటయ్యగౌడ్, అనంత్రెడ్డి, మల్లేశ్, పాండుయాదవ్, నాగరాజుగౌడ్, ఎస్.శ్రీనివా్సగౌడ్ తదితరులు ఉన్నారు. షాబాద్లో గౌడ సంఘం నాయకులు పాపన్నగౌడ్కు ఘన నివాళులర్పించారు. అదేవిధంగా మంచాల మండలం ఆరుట్లలో గౌడసంఘం మండల అధ్యక్షుడు టి.నరేందర్గౌడ్ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. సర్వాయిపాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. సుంకరిప్రవీణ్కుమార్, సర్పంచ్ కొంగరవిష్ణువర్ధన్రెడ్డి, ఉపసర్పంచ్ పాండాలజంగయ్యగౌడ్ ఉన్నారు. అదేవిధంగా కందుకూరులో గౌడసంఘం మండల అధ్యక్షుడు సిద్దేశ్వర్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో మాజీ ఎంపీపీ అనేగౌని అశోక్గౌడ్, యుగేందర్గౌడ్, రవీందర్గౌడ్, రమే్షగౌడ్ నివాళులర్పించారు. అదేవిధంగా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యంగౌడ్, సుధాకర్, వేమ, నరేందర్, కర్నాకర్, శివగౌడ్ పాల్గొన్నారు. అదేవిధంగా యాచారం, నల్లవెల్లి గ్రామాల గౌడసంఘనాయకులు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యాదయ్యగౌడ్, గొల్లపల్లి జంగయ్యగౌడ్ పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో గౌడ సంఘాల నాయకులు పాపన్న విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు చోట్ల కేక్లు కోసి సంబురాలు జరిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చుక్కా అల్లాజీగౌడ్, గంగ రవీందర్, గోలిశ్రీనివాస్ రెడ్డి, నిర్మలశ్రీశైలంగౌడ్, ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, అనురాధ పత్యనాయక్, జక్కు అనంత రెడ్డి, పోనుగోటి అర్జున్ రావు, తోట గిరియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-19T05:41:54+05:30 IST