మన పథకాలు దేశానికే ఆదర్శం
ABN, First Publish Date - 2022-09-24T05:42:09+05:30
మన పథకాలు దేశానికే ఆదర్శం
పరిగి, సెప్టెంబరు 23: మన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి మండల పరిషత్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ప్రతీ కుటుంబం లబ్ధిపొందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంపీపీ అరవింద్రావు, ఏఎంసీ చైర్మన్ సురేందర్, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ ఎం.రాజేందర్, తహసీల్దార్ రాంబాబు, నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- పిల్లలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలి
చిన్నపిల్లలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆహార భద్రత, పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పరిగిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుటుందని తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారి లలిత, మునిసిపల్ చైర్మన్ అశోక్, ఎంపీపీ అరవింద్రావు, ఏఎంసీ చైర్మన్ సురేందర్, సీడీపీవో ప్రియదర్శిని, నాయకులు ప్రవీణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-09-24T05:42:09+05:30 IST