బావిలోపడి యువతి దుర్మరణం
ABN, First Publish Date - 2022-03-17T04:52:27+05:30
బావిలోపడి యువతి దుర్మరణం
యాచారం, మార్చి 16: కుర్మిద్దతండాలో బుధవారం పోలీసులు ఓ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తండాకు చెందిన స్వరూప(40) నాలుగు రోజులుగా కనిపించలేదు. ఆమె మద్యం మత్తులో ప్రమాదవశాత్తు బావిలో పడి దుర్మరణం పాలైనట్లు పోలీసులకు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో కుళ్లిన మృతదేహన్ని శవపరీక్ష కోసం నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి పంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు సీఐ లింగయ్య చెప్పారు.
Updated Date - 2022-03-17T04:52:27+05:30 IST