ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంను కలిసిన ఎమ్మెల్యే రోహిత్‌

ABN, First Publish Date - 2022-07-05T05:30:00+05:30

సీఎంను కలిసిన ఎమ్మెల్యే రోహిత్‌

కేసీఆర్‌కు మొక్కను అందజేస్తున్న రోహిత్‌రె డ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అభివృద్ధి పనులకు జీవోల జారీ పట్ల కృతజ్ఞతలు

తాండూరు, జూలై 5 : సీఎం కేసీఆర్‌తో మంగళవారం నగరంలోని ప్రగతిభవన్‌లో తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాండూరులో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి పలు కీలక పనులకు ప్రభుత్వం ఇటీవల జీవోలు జారీ చేసినందుకుగాను ఎమ్మెల్యే సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తాండూరులో పారిశ్రామికవాడ, పాత తాం డూరు రైల్వే వంతెన, నూతన వ్యవసాయ మార్కెట్‌ యార్డు, ఆటో నగర్‌కు స్థల కేటాయింపు జీవోలు జారీ అయిన విషయం విధితమే. తాండూరుకు సంబంధించిన మరికొన్ని అభివృద్ధి పనులకు ఆమోదం తెలపాలని ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలిపారు. ఈ పనులకు సంబంధించి వినతిపత్రం ఇవ్వగా, అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా కోట్‌పల్లి ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఆధునీకరణ, గొల్ల చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌ నిర్మాణం పూర్తి చేయడం, తాండూరులో నర్సింగ్‌ కాలేజీ, తట్టేపల్లి మండలం ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రికి విన్నవించినట్లు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-07-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising