మంత్రి జగదీశ్వర్రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
ABN, First Publish Date - 2022-07-19T05:12:53+05:30
మంత్రి జగదీశ్వర్రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
ఆమనగల్లు, జూలై 18: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డిని సోమవారం కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి జన్మదినం సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి జగదీశ్వర్రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని కొత్త గ్రామాల్లో విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటు, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.
Updated Date - 2022-07-19T05:12:53+05:30 IST