మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
ABN, First Publish Date - 2022-05-25T05:24:11+05:30
మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
తాండూరు, మే 24 : తాండూరు-హైదరాబాద్ రోడ్డు మార్గంలోని పాత శాలివాహన డిగ్రీ కళాశాల మైదానంలో మంగళవారం రోహిత్ అన్న(అమ్మాయిల) క్రికెట్ టోర్నమెంట్ను మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపానర్సింహులు ప్రారంభించారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కౌన్సిలర్ భీంసింగ్, కో-ఆప్షన్ సభ్యురాలు సారంగ విజయ్కుమార్, నాయకులు ఇంతియాజ్, మహిళా క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-25T05:24:11+05:30 IST