తొలి రౌండ్ ఆధిక్యంలో మను
ABN, First Publish Date - 2022-11-24T23:12:15+05:30
ఈ సీజన్లో నాలుగు జాతీయ గోల్ఫ్ టైటిళ్లు నెగ్గి భీకర ఫామ్లో ఉన్న గురుగ్రామ్ గోల్ఫర్ మను గండాస్ ఊటీ గోల్ఫ్ పోటీల్లోను తన ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు.
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఈ సీజన్లో నాలుగు జాతీయ గోల్ఫ్ టైటిళ్లు నెగ్గి భీకర ఫామ్లో ఉన్న గురుగ్రామ్ గోల్ఫర్ మను గండాస్ ఊటీ గోల్ఫ్ పోటీల్లోను తన ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. వికారాబాద్లో జరుగుతు న్న ఊటీ గోల్ఫ్ మాస్టర్స్ తొలి రౌండ్ ముగిసేసరికి మను 9 అండర్ 63 స్కోరుతో టాప్లో నిలిచాడు. అంగద్ చీమ (చండీగఢ్), కార్తీక్ శర్మ(గురుగ్రామ్) 7 అండర్ 65 స్కోరుతో ద్వితీయ స్థానంలో ఉన్నారు.
Updated Date - 2022-11-24T23:12:16+05:30 IST