TS News: హిమాయత్సాగర్లో దూకి వ్యక్తి ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-08-18T16:31:22+05:30
జిల్లాలోని రాజేంద్రనగర్లో విషాదం చోటు చేసుకుంది. హిమాయత్ సాగర్లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్లో విషాదం చోటు చేసుకుంది. హిమాయత్ సాగర్లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సాగర్లో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు గోషామహాల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ యాదవ్గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాల విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Updated Date - 2022-08-18T16:31:22+05:30 IST