ముమ్మరంగా గ్రంథాలయ నిర్మాణ పనులు
ABN, First Publish Date - 2022-01-20T05:30:00+05:30
ముమ్మరంగా గ్రంథాలయ నిర్మాణ పనులు
ఆమనగల్లు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఆమనగల్లులో మోడల్ గ్రంథాలయ భవన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నా యి. దశాబ్దాల క్రితం నిర్మించిన పాత భవనాన్ని రూ.కోటితో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 8న భవన నిర్మాణానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, విద్యా శాఖమంత్రి సబితారెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ శంకుస్థాపన చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి పర్యవేక్షణలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. బేస్మెంట్ లెవెల్ వరకు పనులు పూర్త య్యాయి. ఆరు నెలల్లో భవన నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తెస్తామని చైర్మన్ పాండురంగారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
Updated Date - 2022-01-20T05:30:00+05:30 IST