ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

ABN, First Publish Date - 2022-01-25T05:08:03+05:30

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

ప్రమాదంలో మృతిచెందిన కుర్వ ఎల్లప్ప
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంట్వారం(కోట్‌పల్లి), జనవరి 24: లారీ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన కోట్‌పల్లి మండలంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంట్వారం మ ండలం రొంపల్లికి చెందిన కుర్వ ఎల్లప్ప(21) నెల రోజుల క్రితం పల్సర్‌ బైక్‌ ను కొన్నాడు. దానికి రిజిస్ట్రేషన్‌ కోసం తండ్రి మహిపాల్‌తో కలిసి వికారాబాద్‌ వచ్చి పనులు ముగించుకుని కోట్‌పల్లి వెళ్లారు. తన తండ్రిని గ్రామానికి చెందిన మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్లమని చెప్పి తాను రాంపూర్‌ వద్ద జరుగుతున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ చూసేందుకు వెళ్లాడు. టోర్ని ముగిసిన తర్వాత తన బైక్‌పై వస్తుండగా అన్నసాగర్‌ సమీపాన ఉన్న మలుపు వద్ద ఎదరుగా వచ్చిన లారీ ఢీకొంది. తలకు గాయాలై ఎల్లప్ప మృతిచెందాడు. అతడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. తండ్రి మహిపాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనమా నిర్వహించి మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

Updated Date - 2022-01-25T05:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising