విజ్ఞానంతోనే విజేతలవుతారు
ABN, First Publish Date - 2022-11-23T23:52:58+05:30
ప్రతీ విద్యార్థి విజ్ఞానవంతులుగా ఎదిగితేనే జీవితంలో విజేతలవుతా రని ఐఎంఏ షాద్నగర్ అధ్యక్షుడు రమేష్ బండారి అన్నారు.
షాద్నగర్ అర్బన్, నవంబరు 23: ప్రతీ విద్యార్థి విజ్ఞానవంతులుగా ఎదిగితేనే జీవితంలో విజేతలవుతా రని ఐఎంఏ షాద్నగర్ అధ్యక్షుడు రమేష్ బండారి అన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలను ఠాగూర్ పాఠశాలలో బుధవారం నిర్వహించారు. 43 పాఠశాలలు పాల్గొన్న సంబరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో విజేతలను ఎంపిక చేశారు. జేవీవీ నాయకులు జి.సుధాకర్రెడ్డి, రజాక్, కె.జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-23T23:52:59+05:30 IST