గట్టుమైసమ్మ జాతరకు మంత్రికి ఆహ్వానం
ABN, First Publish Date - 2022-01-28T04:52:56+05:30
గట్టుమైసమ్మ జాతరకు మంత్రికి ఆహ్వానం
ఘట్కేసర్, జనవరి 27 : ఈ నెల 30న జరిగే ఘట్కేసర్ గట్టుమైసమ్మ జాతరకు విచ్చేయాలని ఆలయ కమిటీ, ఘట్కేసర్ మున్సిపాలిటీ పెద్దలు గురువారం మంత్రి మల్లారెడ్డిని ఆయన నివాసంలో కలిసి ఆహ్వానపత్రిక అందజేసారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లో పర్యటించిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యులతో మంత్రి సమావేశమయ్యారు. దళితబంధుపై చర్చించారు. అనంతరం మున్సిపల్ పాలకవర్గం రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వారిని సన్మానించారు. ఈ సందర్భంగా కేక్ కట్చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్చంద్రారెడ్డి, చైర్పర్సన్ ముల్లి పావని, వైస్చైర్మన్ పల్గుల మాధవరెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-28T04:52:56+05:30 IST