మాయమాటలు చెప్పి బాలికను గర్భవతిని చేసి..
ABN, First Publish Date - 2022-05-25T05:46:43+05:30
మాయమాటలు చెప్పి బాలికను గర్భవతిని చేసి..
షాబాద్, మే 24: మాయ మాటలు చెప్పి ఓ వ్యక్తి బాలికను గర్భవతిని చేసిన ఘటన మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మాదేపురం రాజు వివాహితుడు. అదే గ్రామానికి చెందిన బాలిక(15) 9వ తరగతి చదువుతోంది. బాలికను రాజు గత ఎనిమిది నెలలుగా మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో బాలికలో శరీర మార్పులను గమనించిన తల్లిదండ్రులు వైద్యుడిని సంప్రదించారు. బాలిక ఏడు నెలల గర్భవతిగా తేలడంతో తల్లిదండ్రులు బాలికను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈమేరకు పోలీసులు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని తొందరలో అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Updated Date - 2022-05-25T05:46:43+05:30 IST