ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN, First Publish Date - 2022-08-08T05:30:00+05:30

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న చామకూర భద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆగస్టు 8: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతిఇంటికీ చేరేలా కార్యకర్తలు కృషిచేయాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తనయుడు, టీఆర్‌ఎస్‌ నాయకుడు చామకూర భద్రారెడ్డి తెలిపారు. ఎదులాబాద్‌లో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, కానీ ప్ర జలకు వివరించడంలో మనం వెనుకపడుతున్నామని గుర్తుచేశారు. వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. చురుగ్గా పనిచేసే కార్యకర్తలను వలంటీర్లుగా నియమిస్తామన్నారు. మాజీ జెడ్పీటీసీ సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివా్‌సగౌడ్‌, సర్పంచ్‌ సురేష్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రమేష్‌, ప్రవీణ్‌రెడ్డి, శంకర్‌, నాగరాజు, భిక్షపతిగౌడ్‌, రవి, కుమార్‌, ధర్మారెడ్డి, ఉప్పు లింగేశ్వర్‌రావు, చిరంజీవి, శ్రీనివాస్‌, బాల్‌రాజ్‌, ఆశి్‌షరెడ్డి, సంతో్‌షగౌడ్‌, అరవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising