మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం
ABN, First Publish Date - 2022-03-19T04:44:10+05:30
మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం
తలకొండపల్లి, మార్చి 18: మండలంలోని బల్సులపల్లి గ్రామానికి చెందిన చంద్రు అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందాడు. మృతదేహాన్ని తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.3వేలు ఆర్థికసాయాన్ని అందజేశారు. పరామర్శించిన వారిలో నాయకులు లక్ష్మణ్ నాయక్, దాసునాయక్, బాలకృష్ణ, యాదగిరి, లక్ష్మణ్ ఉన్నారు.
Updated Date - 2022-03-19T04:44:10+05:30 IST