విద్యుదాఘాతంతో రైతు మృతి
ABN, First Publish Date - 2022-06-29T05:14:35+05:30
విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన
తలకొండపల్లి, జూన్ 28 : విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన సంఘటన తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యన్నం వెంకట్రెడ్డి(55) గ్రామసమీపంలో తన వ్యవసాయ పొలం వద్ద బోరు మోటారు మరమ్మతులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్వైర్లు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య అలివేలు, నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2022-06-29T05:14:35+05:30 IST