సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ABN, First Publish Date - 2022-08-14T05:37:20+05:30
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఆమనగల్లు, ఆగస్టు 13: ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం నగరంలోని ఆయన నివాసంలో పంపిణీ చేశారు. మొత్తం రూ.1.86 లక్షలు విలువ గల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కడ్తాల మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జోగు వీరయ్య, నాయకులు ముత్యంగౌడ్, శ్రీనివా్సరెడ్డి, సురేందర్రెడ్డి, కొండల్రెడ్డి, హన్మానాయక్, యాదగిరిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, అల్లాజి, బాబా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-14T05:37:20+05:30 IST