వాహనం ఢీకొని జింక మృతి
ABN, First Publish Date - 2022-06-07T05:39:35+05:30
వాహనం ఢీకొని జింక మృతి
వికారాబాద్, జూన్ 6: వాహనం ఢీకొని జింక మృతిచెందిన సంఘటన వికారాబాద్ అనంతగిరి అడవుల్లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అనంతగిరి ఆలయ దారిలో వాటర్ ట్యాంక్ సమీపంలో జింక రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొ నడంతో మృతిచెందింది. ఇప్పటి వరకు అనంతగిరి కొండల్లో ఇలా జింకలు అనేకం మృతిచెందాయి. ఈ అడవుల్లో వన్యప్రాణులకు రక్ష ణ కరువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2022-06-07T05:39:35+05:30 IST