ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికారాబాద్ జిల్లా: కడ్మూరులో భారీ సైబర్ మోసం

ABN, First Publish Date - 2022-01-05T20:45:06+05:30

వికారాబాద్ జిల్లా: లైమ్ కంపెనీ యాప్ ఉచ్చులో పలువురు చిక్కుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్ జిల్లా: లైమ్ కంపెనీ యాప్ ఉచ్చులో పలువురు చిక్కుకున్నారు. వికారాబాద్ జిల్లా, పూడూరు మండలం, కడ్మూరులో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. కడ్మూరులో వందల సంఖ్యలో జనం సైబర్ మోసం ఉచ్చులోపడి నష్టపోయారు. దాదాపు 2 వందల మంది వాట్సాప్‌లో వచ్చిన లింకులోని యాప్‌తో మోసపోయారు.


లైమ్ కంపెనీ పేరుతో ఓ లింక్‌ను యువకులంతా ఒకరికొకరు షేర్ చేసుకుని యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. యాప్‌లో పెట్టుబడి పెడితే డబ్బులు వస్తున్నాయని నమ్మి దాదాపు 2 వందల మంది పెట్టుబడి పెట్టారు. రూ. 5 వందల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెడితే ప్రతిరోజు ఆదాయం వస్తుందని నమ్మి యాప్‌లో పెట్టుబడి పెట్టారు. సీమా అనే మహిళ వాట్సాప్ చాట్ ద్వారా పెట్టబడి పెట్టించినట్టు బాధితులు చెబుతున్నారు. ‘న్యూ ఇయర్ ఆఫర్’ అంటూ రూ. 10వేలకు లక్ష, లక్షకు 5 లక్షలు అంటూ ఆఫర్ ఇవ్వడంతో ఆ మహిళ మాటలు నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టారు. మొదట్లో ఆదాయం బాగానే రావడం గమనించి మరింత లాభం వస్తుందనే ఆశతో అప్పు చేసి లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. కొన్ని రోజులు బాగానే డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత యాప్ ద్వారా విత్ డ్రా కావడం ఆగిపోయింది. దీంతో బాధితులు లబోదిబో మంటున్నారు.

Updated Date - 2022-01-05T20:45:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising