ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేతల పాదయాత్ర

ABN, First Publish Date - 2022-08-08T05:42:27+05:30

ప్రతీ అసెంబ్లీలో ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు 75 మంది

మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆగస్టు 9 నుంచి 15 వరకు 75 మంది నేతలతో 75 కిలో మీటర్లు..
  • వైభవంగా వజ్రోత్సవాలు జరుపుకోవాలి 
  • ముఖ్య నాయకులు సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి


రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 7 : ప్రతీ అసెంబ్లీలో ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు 75 మంది కాంగ్రెస్‌ నేతలు 75 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తెలిపారు. పాదయాత్ర నిర్వహణపై పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పాదయాత్రకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ తయారు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఎందరో మహానుభావుల సమరయోధుల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని భావితరాలకు గుర్తుచేసేందుకు వైభవంగా వజ్రోత్సవ వేడుకలను నిర్వహించుకోవాలని తెలిపారు. పాదయాత్ర చేసే నాయకులు తెల్ల టోపీ, వైట్‌ డ్రైస్‌, భుజంపై జాతీయజెండాను ధరించాలని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పీసీసీ కార్యదర్శులు వేణుగౌడ్‌, మధుసూధన్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు జనార్ధన్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, తితేందర్‌, వీర్లపల్లి శంకర్‌, వీరేందర్‌రెడ్డి, మాణయ్య, మహేష్‌, చల్లా బాల్‌రెడ్డి, శ్రీశైలం, రమేష్‌, అబ్ధుల్‌ బారి, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-08T05:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising