చిన జీయర్స్వామి అశీస్సులు తీసుకున్న ఏఐఏటీఎఫ్ చైర్మన్ బిట్టా
ABN, First Publish Date - 2022-05-21T05:30:00+05:30
చిన జీయర్స్వామి అశీస్సులు తీసుకున్న ఏఐఏటీఎఫ్ చైర్మన్ బిట్టా
శంషాబాద్ రూరల్, మే 21: ముచ్చింతల్ శ్రీరామనగరం దివ్యక్షేత్రంలో ఏఐఏటీఎఫ్ (ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్) చైర్మన్ మణిందర్జిత్ సింగ్ బిట్టా శనివారం ప్రముఖ అధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి చినజీయర్స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం దివ్యక్షేత్రంలోని సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. సువర్ణమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బిట్టా మాట్లాడుతూ సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. చినజీయర్స్వామి బిట్టాకి మంగశాసనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్రావు ఉన్నారు.
Updated Date - 2022-05-21T05:30:00+05:30 IST