ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం
ABN, First Publish Date - 2022-07-01T05:30:00+05:30
ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం
చేవెళ్ల/కడ్తాల్, జూలై 1: అంతారంలో జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావలి వెంకటేశ్ శుక్రవారం సన్మానించారు. ప్రతిభ కనబరిచిన వడ్ల శ్రీవాణికి రూ.5వేలు, భరత్కుమార్కు రూ.3వేలు ప్రోత్సాహకంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుజాత, హెచ్ఎం మల్లేశం, ఉపాధ్యాయులు మాణిక్రావు, నర్సింలు, హతీరం, మున్ని హని ఉన్నారు. అదేవిధంగా కడ్తాల్ మండల కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శుక్రవారం కరస్పాండెంట్ సువర్ణగోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో సత్కరించారు.
Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST