మునిసిపాలిటీ అభివృద్ధే లక్ష్యం
ABN, First Publish Date - 2022-01-28T04:58:41+05:30
మునిసిపాలిటీ అభివృద్ధే లక్ష్యం
కీసర రూరల్, జనవరి 27 : నాగారం మునిసిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగారం పంచాయతీ స్థాయి నుంచి రాంపల్లితో కలిపి మున్సిపాలిటీగా అవతరించిందన్నారు. గత రెండు సంవత్సరాల్లో మున్సిపాలిటీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయటంతో పాటు పెద్దఎత్తున అభివృద్ది పనులు చేపట్టినట్లు వివరించారు. మున్సిపల్ ప్రజలందరూ టీకా వేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ మల్లేష్, కమిషనర్ వాణి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-28T04:58:41+05:30 IST