ఆత్మవిశ్వాసాన్ని నింపిన ‘దళితబంధు’
ABN, First Publish Date - 2022-07-04T05:48:36+05:30
ఆత్మవిశ్వాసాన్ని నింపిన ‘దళితబంధు’
ఆమనగల్లు, జూలై 3: దళితబంధు పథకం దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఆత్మగౌరవాన్ని పెంచిందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీకి చెందిన పలువురు లబ్ధిదారులకు దళితబంధు పథకం యూనిట్ల కింద మంజూరైన కార్లను ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రెండోవిడత కల్వకుర్తి నియోజకవర్గానికి 1500ల దళితబంధు యూనిట్లు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ఎంపీపీ శంకర్ నాయక్, మార్కెట్ డైరెక్టర్ సురమల్ల సుభాష్, నాయకులు చలిచీమల సతీష్, గుమ్మకొండ రాజు, నర్సింహ పాల్గొన్నారు.
Updated Date - 2022-07-04T05:48:36+05:30 IST