ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొంతులో లివర్‌ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-11-15T00:29:09+05:30

భోజనం చేస్తుండగా గొంతులో లివర్‌ ముక్క ఇరుక్కొని ఓ వ్యక్తి మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేవెళ్ల, నవంబరు 14: భోజనం చేస్తుండగా గొంతులో లివర్‌ ముక్క ఇరుక్కొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ హయూబ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నుల్‌ జిల్లాకు చెందిన లింగస్వామి(46) అతడి భార్య పార్వతమ్మతో కలిసి బతుకు దెరువు కోసం గతేడాది చేవెళ్ల పట్టణ కేంద్రానికి వచ్చారు. చేవెళ్లలోనే గుడిసెలు వేసుకుని కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి చికెన్‌తో పాటు లివర్‌ కొనుగోలు చేసి వారు ఉంటున్న గుడిసేలోనే వండుకుని భార్యభర్తలు భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలో లింగస్వామికి గొంతులో లివర్‌ ముక్క ఇరుక్కుంది. దీంతో వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పరిస్థితి విషమించడంతో నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లింగస్వామి అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-11-15T00:29:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising