టికెట్లు ఎవరికనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ABN, First Publish Date - 2022-04-05T03:06:02+05:30
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున టికెట్లు ఎవరికనేది
ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున టికెట్లు ఎవరికనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్థానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన నాయకులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఉన్న వివాదాలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఇక నుంచి వివాదాలు లేకుండా ముందుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంతో ఎలాంటి చర్చలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. టికెట్లు ఎవరికి ఇవ్వాలనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీని ఓడించి తెలంగాణలో మంచి మెజారిటీతో విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-04-05T03:06:02+05:30 IST